తన సూటైన పద్యాలతో ప్రజాహృదయాలలోకి వెళ్ళిన జనుల కవి వేమన.పండిత,పామరులనే భేదం లేకుండా వేమన పద్యాలు సులువుగా అర్ధమవుతాయి.వేమన పద్యాలన్నీ ఇంచుమించు ఆటవెలదిలో ఉండి నాలుగు పాదాలలో చివరిపాదం 'విశ్వదాభిరామ వినురవేమా'అనే మకుటంతో ముగుస్తుంది.వేమన పద్యాలు వినని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి లేదేమో అంతగా జనంలోకి చొచ్చుకుపోయాయి.ప్రతీ పద్యం ఒక ఆణీముత్యమే.తెలుగు భాషకై ఎంతో కృషి సల్పిన బ్రౌన్ అక్కడక్కడా చల్లాచదురై ఉన్న పద్యాలన్నీ సేకరించి తెలుగు వారికి అందించాడు.వేమన పద్యాలు యునెస్కోవారు గుర్తించి అనేక భాషల్లోకి అనువదించారు.
వేమన యొక్క జీవితానికి సంభందించి స్పష్టమైన ఆధారాలు లభ్యంకావడంలేదు.దీనిపై అనేక రకాలైన కధనాలు ప్రచారంలో ఉన్నాయి.అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం వేమన కడప జిల్లాలోని మూగచింతపల్లె అనే గ్రామంలో జన్మించాడు.ఇతడు 1650 - 1750 మద్యకాలంలోని వాడని తెలుస్తుంది.వేమన యవ్వనంలో వేశ్యాలోలుడై తనదగ్గరి ఆస్తినంతా వారికే దారపోసాడు.ఒక సంధర్బంలో తన వదినగారి వల్ల జ్ఞానోదయమై తన తప్పును తను ఎరిగి ఇహపర సుఖాలుపై వ్యామొహం వదిలి ఊరూర తిరిగి నీతిని,ఆత్మ,కుల,ఆర్ధిక సంస్కారాలను భోదించాడు.వేమనకు స్వర్ణం ఎలా తయారుచేసే విద్య కూడా తెలుసు.చివరకు అందరి ఎదుటా సమాది అయ్యాడు.
వేమన పద్యాల్లో ఉండే విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంపై కూడా సందిగ్దం ఉంది,ఒక వాదన ప్రకారం విశ్వద అంటే తనకు జ్ఞానోదయం ప్రసాదించిన వదిన గారు అని అభిరాముడంటే తన స్నేహితుడైన స్వర్ణకారుడు.వేరోక వాదన ప్రకారం విశ్వద అంటే విశ్వకారుడని అభిరామ అంటే ప్రియమైనవాడని అర్ధం.వినురవేమ అంటే వేమన చెప్పినది వినుమ అని.
తెలుగు వారికి వేమన అనగానే గుర్తొచ్చే పద్యం
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచులు జాడవేరయా
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ
భావం - చూడడానికి ఉప్పు,కర్పూరం ఒకేలా ఉంటాయి.కానీ వాటివాటి ధర్మాలు వేరు.అలాగే మనుషులంతా ఒకేలా ఉంటారు వారిలో పుణ్యపురుషులు వేరని అర్ధం.