పూర్ణకుంభాన్ని హిందువులు పవిత్రత,శుభసూచికలకు చిహ్నంగా భావించి పెళ్ళిళ్ళు,గృహప్రవేశం మొదలైన శుభకార్యాలకు ఏర్పాటుచేసేవారు.దినిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నంగా గుర్తించింది.తెలుగువారు ఇంచుమించు ప్రతీ శుభకార్యంలోనూ పూర్ణకుంభం ను ఉపయోగిస్తారు.
పూర్ణకుంభం తయారు చేయువిధానం -
ఇత్తడి చెంబులాంటి పాత్రలో సగభాగం వరకూ నీటిని నింపి పైభాగంలో కొబ్బరికాయను ముచ్చిక పైకి వచ్చెటట్టు ఏర్పాటు చేస్తారు.చెంబు అంచు చుట్టూ పసుపుతో తడిపిన దారంతో మామిడాకులను కట్టి వేద మంత్రోచ్చారనతో దీనిని రూపొందిస్తారు.పూర్ణకుంభంతో స్వాగత సమయంలో అతిదులకు ఆహ్వనం పలుకుతారు.
|