తేట తెలుగు భాషలో ఆంధ్రదేశంలోని చరిత్ర,సంస్కృతి,నదులు,కట్టడాలు మొదలైన వాటిని అందంగా ఏరి కూర్చిన గేయం మాతెలుగు తల్లికి మల్లెపూదండ.దీనిని శంకరంబాడి సందరాచారి రచించారు.ఈ గేయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది.సుందరాచారి రచించిన ఈ గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి అలపించి ప్రాణ ప్రతిష్టచేసారు.
మాతెలుగు తల్లికి మల్లెపూదండ
మాకన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గల గలా గోదారి కదిలిపోతుంటేను
బిర బిరా క్రుష్ణమ్మ పరుగులెడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గోంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయూక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే మేము ఆడతాం నీ పాటలే మేము పాడతాం
జైతెలుగు తల్లి జైతెలుగు తల్లి జైతెలుగు తల్లి
|