పల్లె సీమల్లో తెల్లారుపొద్దున్నే "అంబపలుకు జగదంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు" అంటూ ఢమరుకం మోగించుకుంటూ వచ్చే ప్రతీ ఇంటికి వచ్చి జరగబోయే సంగతులన్నీ చేప్పే వానిని బుడబుక్కలు వాడు అని అంటారు.ఈ కళ అతి ప్రాచినమైన కళ దీని గురించి పురాణ ఇతి హాసాల్లో ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది.
త్రేతాయుగంలో శ్రీరాముడు,సీతాదేవి వనవాసం చెయుచున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రావణాసురుడు బుడబుక్కలు వాని వేషం ధరించి సీతాదేవిని ఎత్తుకుపోయాడని ఉంది.బుడబుక్కలువాని గురించి ఒక కధ కూడా ప్రచారంలో ఉంది.అదేమిటంటే త్రెతాయుగంలో ఈశ్వరుడు డంభికాసురుడు అనే రాక్షసుడిని సమ్హరించి వాని వెన్నుముకని బుడబుక్కగుల్లగా అమర్చి వాని నరములను తాళ్ళుగా చేసి చర్మాన్నీ మూతలుగా చేసి,వాని మెదడును మైనంగా ఉపయోగించి ఢమరుకంగా చేసి దాన్ని వాయిస్తూ అయోధ్యని పరిపాలిస్తున్న దశదమహరాజు వద్దకి వచ్చి నీకు నలుగురు పిల్లలు పుడతారని చెప్పాడట.
బుడబుక్కల వాద్యాన్ని ఉడుక్క,పలుడక్క,డుక్క,డబ్ డక్క అని పిలుస్తారు.బుడబుక్కలు వాడు తెల్లటి పంచెని ధరించి నల్లకోటుతో పాటు ఎర్రటి తలపాగా కట్టుకుని నడుముకు గంట కట్టుకుని ఢమరుకం వాయిస్తూ ఇళ్ళదగ్గరికి వస్తారు.వీరు జోస్యము చెప్పినదానికి భిక్షై స్వీకరిస్తారు.కాలక్రమేణ ఈ బుడబుక్కల వారు కనుమరుగవుతున్నారు.