వీధి నాటకాలకు ఇదివరకూ పల్లెసిమల నుండి పట్టణాల వరకూ విశేషమైన ఆదరణ వుండేది.అయితే టివి,సినిమా మాద్యమాలు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఈ రంగస్ధల నాటకాలకు ఆదరణ కరువయ్యింది.ఈ కళా రూపకంలో రంగస్ధల నటులు ఒక కధని లేదా ఒక ఘట్టాన్ని తీసుకుని రంగస్ధలం అనగా స్టేజిపై ప్రదర్శిస్తారు.ఈ ప్రదర్శనలో రంగస్ధలంపై ఉన్నటువంటి నటులు కధలోని ఘట్టానికి అనుగుణంగా సంభాషణలు పద్యాలు చెబుతారు.వీరికి వాయిద్య సహకారం కూడా ఉంటుంది. దీనిలో కళాకారుల పాత్రలు సందర్భానుసారంగా నాట్యం కూడా చేస్తారు.
రంగస్ధల కళాకారులు పాత్రలకు అనుగుణంగా వేషదారణ చేసుకుంటారు.ఎవరి పద్యాలను వారే సొంత గొంతుతో పాడుకుంటారు.ఈ నాటకాల్లో తొలుత కేవలం పురాణ గాధలనే ప్రదర్శించగా ఆ తరువాత కాలక్రమంలో సాంఘిక కధలను కూడా ఇతివృత్తంగా చేసుకుని నాటకాలను ప్రదర్శించేవారు.సత్య హరిశ్చంద్ర,శ్రీ కృష్ణతులాభారం వంటి నాటకాలు పురాణ నాటకాలకు ఉదాహారణలు కాగా చింతామణి వంటి నాటకాలు సాంఘికాలుగా ఉదాహరణగా చేప్పుకోవచ్చు.నాటాకాలను బేస్ చేసుకుని ప్రస్తుతం మనం చూస్తున్న సినిమాలు వచ్చాయి.పాతతరం సినిమా నటులందరూ ఒకప్పటి రంగస్ధల కళాకారులే.నాటకాలు వెయ్యడంలో సురభి కళాకరులది అందివేసిన చెయ్యి.అయితే ప్రస్తుతం నాటకాలకు ఆదరణ కరువయ్యింది.