హైదరాబాదు అనగా ముందుగా గుర్తొచ్చేది చార్మినర్ అంతగా నగరంతో ఈ కట్టడం పేనవేసుకుంది.దీనిని హైదరాబాదును నిర్మించిన కులీకుతుబ్ షాహీ అప్పట్లో వచ్చిన ప్లేగువ్యాధి నివారణకు సూచకంగా క్రీ"శ 1591 -92 మధ్యకాలంలో నిర్మించాడు.ఈ కట్టడం హీందూ,మహ్మదీయ వాస్తుకళా నైపుణ్యంతో కట్టబడింది.దీనికి నాలుగు వైపులా నాలుగు స్ధంబాలు కలవు నాలుగు మినార్ లు ఉన్నాయి.కాబట్టి దీనిని చార్మినర్ అంటారు.దీని ప్రతిభుజము 31.95మీ" కలిగి చతురస్రాకారంలో 11మి"కలిగిన నాలుగు స్తంభాలతో నిర్మించారు.మొత్తం చార్మినర్ రెండు అంతస్తులు కలిగి ఉంది.ఈ స్తంభాలనుండి చివరివరకూ ఎక్కడానికి 149 మెట్లు కలవు.దీనికి నాలుగు వైపుల నాలుగు గడుయారాలను 1889 వ సంవత్సరంలో అమర్చారు.
దీని రెండవ అంతస్తువరకూ వెళ్ళడానికి మొదట సందర్శకులకు అనుమతి ఉండేది.అయితే దీని మీదనుండి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే కారణంగా ప్రస్తుతం మొదట అంతస్తువరకే ఎక్కనిస్తున్నారు.దీనిని పైకి ఎక్కడానికి పర్యాటకులు క్రింద 5రూపాయిలు చెల్లించి ఎక్కవచ్చును.చార్మినర్ చుట్టూ అనేక రకాలైన షాపులు కలవు.ఇక్కడ చీరలు,గాజులు,ముత్యాలుకు మంచి పేరు ఉంది.దీనిని మన పర్యాటకులతో పాటు విదేశాలనుండి వచ్చిన పర్యాటకులు కూడా అనునిత్యం సందర్శిస్తున్నారు.దీనికి కూత వేటు దూరంలోనే ముస్లింలకు ఎంతో ఎంతో పవిత్రమైన పురాతన మక్కా మసీదు కలదు.
చార్మినర్కు చేరుకోవడానికి హైదరాబాదు నగరంలోని అన్నీ ప్రాంతాల నుండి బస్సుసౌకర్యం కలదు.