తెలుగుదేశం పార్టీ -
తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ మార్చి 29,1982వ సంవత్సరంలో స్థాపించారు.అప్పటివరకూ రాజకీయ పార్టీ అంటే కాంగ్రేస్ నే. అలాంటి కాంగ్రేస్ విజయపరంపరకు బ్రేక్ వేసి సుడిగాలిలా రాష్ట్రం అంతా తిరిగి పార్టీ స్ధాపించిన 9 నెలల కాలంలోనే రికార్డుస్ధాయి మెజారిటీతో ముఖ్యమంత్రి కాగలిగాడు. యన్.టి.ఆర్ ఆయన పరిపాలనా కాలంలో 2రూపాయలకే కిలో బియ్యం, మధ్యపాన నిషేధం వంటి వాటితో
తెలుగువాడి గుండెలో చిరస్ధాయిగా నిలిచిపోయాడు. 1988 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా తిరిగి 1993 ఎన్నికల్లో విజయకేతనం ఎగర వేసారు. తరువాత నాటకీయపరిణామాల నేపధ్యంలో యన్.టి.ఆర్ హయంలో ఆర్ధికశాఖామంత్రిగా పనిచేసిన యన్.టి.ఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు 1995లో అధికారం చేజిక్కించుకిని 9 సంవత్సరాలు అప్రతిహసంగా పరిపాలన కోనసాగించాడు.
చంద్రబాబు తన హయంలో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా అభివృధ్ది చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.ఎన్నో ఐటీ దిగ్గజ కంపేనీలు తమ శాఖలును హైదరాబాద్లో ఏర్పాటుచేసాయి.బెంగుళూరు తరువాత మన హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా ఎదగడంలో చంద్రబాబు పాత్ర మరువలేనిది అయితే 2004, 2009 ఎన్నికలలో టి.డీ.పీ కాంగ్రేస్ పార్టీ చేతిలో తన అధికారం కొల్పోవలసి వచ్చింది.
|